కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి బ్రాడ్రిడ్జ్ అనే ఐటీ కంపెనీ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించింది. ఈ మేరకు రూ. 50 లక్షల చెక్కును ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు బ్రాడ్రిడ్జ్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో ముందు వరుసలో ఉండి పని చేస్తున్న హెల్త్ కేర్ వర్కర్స్, పోలీసుల పట్ల పేటీం, లైఫ్ బాయ్ సోప్, యూ వూరు కెన్ సంస్థలు మానవత్వాన్ని చాటుకున్నాయి. ఈ మేరకు ఒక లక్ష హైజిన్ ప్రొడక్ట్స ను మంత్రి కేటీఆర్కు ఆయా సంస్థల ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Many thanks to @Broadridge India for donating Rs. 50,00,000/- to CM Relief Fund to combat #COVID19 crisis. Appreciate your social responsibility: Minister @KTRTRS pic.twitter.com/ty7jLFwriB
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 3, 2020