మరో షాకింగ్ న్యూస్.. జైల్లో 103 మందికి కరోనా.. వణుకుతున్న ఖైదీలు

| Edited By:

May 08, 2020 | 11:56 AM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొన్నటి మహారాష్ట్రలో వరకు వందల్లో నమోదైన కేసులు.. తాజాగా రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబై నగరంలో నమోదవుతున్న కేసులు గజగజ వణికిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధానిలో ఇలా కేసులు నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఏకంగా 103 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. జైలులో ఉన్న 77 మంది […]

మరో షాకింగ్ న్యూస్.. జైల్లో 103 మందికి కరోనా.. వణుకుతున్న ఖైదీలు
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొన్నటి మహారాష్ట్రలో వరకు వందల్లో నమోదైన కేసులు.. తాజాగా రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబై నగరంలో నమోదవుతున్న కేసులు గజగజ వణికిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధానిలో ఇలా కేసులు నమోదవుతుండటంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఏకంగా 103 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. జైలులో ఉన్న 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 26 మంది జైలు ఉద్యోగులకు పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా సోకిన ఖైదీలను, జైలు ఉద్యోగులను శుక్రవారం ఉదయం నగరంలోని సెయింట్ జార్జ్ , గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు.

ఖైదీలున్న ఆస్పత్రుల వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసి.. సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. అయితే గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచారు. అయితే ఆ నిందితుడికి కరోనా ఉండటంతో.. ఇతర ఖైదీలకు, జైలు సిబ్బందికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. గతంలో కరోనా వచ్చిన ఖైదీని జేజే ఆసుపత్రికి తరలించారు. జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో ఇకనుంచి కొత్తగా జైలుకు వచ్చే ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ జైలు ఎదుటే.. కరోనా రోగులున్న కస్తుర్బా ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రి ఉండటంతోపాటు.. జైలులోకి నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్న వారితో ఈ వైరస్ వ్యాపించి ఉంటుందన్న అనుమానాలను కూడా జైళ్ల శాఖ ఇన్ స్పెక్టర్ వ్యక్తం చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ జైల్లో 2600 ఖైదీలు ఉన్నారని… వీరందరికీ కూడా కరోనా ప్రబలే అవకాశం ఉందని భయాందోళనలు చెందుతున్నారు.