కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే అన్లాక్ 1.0 ప్రారంభమైందో.. అప్పటి నుంచి కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. గతంలో అత్యల్పంగా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వేలల్లో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా మణిపూర్ రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి రెండు వారాల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మణిపూర్లో ఇప్పటి వరకు 2,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,400 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Manipur to go under complete lockdown for 14 days, starting 2 pm tomorrow. #COVID19 pic.twitter.com/1L9hYskgqn
— ANI (@ANI) July 22, 2020