వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి..

| Edited By: Pardhasaradhi Peri

Apr 02, 2020 | 4:50 PM

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లోని తత్పట్టి బఖల్ ప్రాంతంలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం ఉందని ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి తెలియజేసింది. ఓ కరోనా పాజిటివ్ రోగితో పరిచయం ఏర్పడిందని చెప్పడంతో సదరు వృద్దురాలును పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్‌ నగరానికి వెళ్లారు. ఈక్రమంలో అక్కడి స్థానికులు వైద్య సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. రాళ్లతో కొట్టడంతో పాటు.. కర్రలను కూడా వారిపై విసురుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు.ఈ […]

వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి..
Follow us on

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లోని తత్పట్టి బఖల్ ప్రాంతంలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం ఉందని ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి తెలియజేసింది. ఓ కరోనా పాజిటివ్ రోగితో పరిచయం ఏర్పడిందని చెప్పడంతో సదరు వృద్దురాలును పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్‌ నగరానికి వెళ్లారు. ఈక్రమంలో అక్కడి స్థానికులు వైద్య సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. రాళ్లతో కొట్టడంతో పాటు.. కర్రలను కూడా వారిపై విసురుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు.ఈ దాడిలో ఇద్దరు మహిళ వైద్యులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ఇండోర్‌ నగరంలోనే కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. ఇక్కడ కూడా మర్కజ్‌ సమావేశాలకు వెళ్లిన వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మరోవైపు యూపీలోని ముజఫ్ఫర్ పూర్‌లో కూడా పోలీసులపైకి దాడికి పాల్పడ్డారు ఓ వర్గం ప్రజలు.