లాక్‌డౌన్‌ వేళ.. ఆ భవనంలోకి గృహ ప్రవేశమైన చిరుత కుటుంబం..

| Edited By: Pardhasaradhi Peri

Apr 17, 2020 | 3:54 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అడవిలో ఉంటున్న జంతువులన్నీ.. యథేచ్చగా రోడ్లపైకి.. గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత పులి.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి ఎంటరయ్యింది. అంతేకాదు.. ఆ గ్రామంలో ఉన్న పురాతన భవనంలోకి ప్రవేశం కూడా చేసింది. అక్కడే తన మూడు పిల్లల్ని […]

లాక్‌డౌన్‌ వేళ.. ఆ భవనంలోకి గృహ ప్రవేశమైన చిరుత కుటుంబం..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అడవిలో ఉంటున్న జంతువులన్నీ.. యథేచ్చగా రోడ్లపైకి.. గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత పులి.. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి ఎంటరయ్యింది. అంతేకాదు.. ఆ గ్రామంలో ఉన్న పురాతన భవనంలోకి ప్రవేశం కూడా చేసింది. అక్కడే తన మూడు పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టి.. వాటి ఆలనా పాలన చూస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సీసీ ఫుటేజీలో రికార్డ్‌ అయిన ఈ చిరుత కుటుంబం గురించి.. ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్‌ కశ్వన్‌ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అధికారి షేర్‌ చేసిన వీడియోలో.. రాత్రి సమయంలో ఆ ఇంట్లోకి వచ్చిన చిరుత.. తన మూడు పిల్లలను నోటితో పట్టుకుని.. ఓ రూంలోకి తీసుకెళ్తూ కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ షేర్స్ చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు సీసీ ఫుటేజీ ద్వారా చిరుత కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని పర్వీన్ తెలిపారు. కేవలం 21 సెకన్ల నిడివి గల ఈ చిరుత వీడియోను షేర్‌ చేస్తూ.. ‘లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారని.. ఈ క్రమంలో చిరుత పులి కూడా.. షెల్టర్ ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్రంలోని తంటోల్ గ్రామంలోని ఓ పురాతన భవనాన్ని ఎంచుకుని అందులో ఉంటుందంటూ పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వేటకు వెళ్తూ.. రాత్రి సమయంలో మళ్లీ ఈ ఇంట్లోకి ప్రవేశించి తన పిల్లల దగ్గరికి వస్తోందంటూ తెలిపారు. ప్రస్తుతం ఆ మూడు పులి పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని.. ట్వీట్‌లో పేర్కొన్నారు.