చైనా పట్ల భారత్ మెతక వైఖరి ? ఎఫ్ డీ ఐ పాలసీ సవరణపై వెనక్కి ?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీని సవరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా వెలిబుచ్చిన అభ్యంతరంతో కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రపంచ వాణిజ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలను భారత్ అతిక్రమిస్తోందని  చైనా చేసిన ఆరోపణను కొట్టి పారేస్తూనే.. మరోవైపు.. ఈ సవరణ.. అనుమతిని తిరస్కరించినట్టుగా భావించరాదని, ఇది ఆమోద ప్రక్రియ మాత్రమేనని తాజాగా స్పష్టం చేసింది. అంతే తప్ప ఇందులో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ఉల్లంఘన ప్రసక్తే లేదని పేర్కొంది. ఇది […]

చైనా పట్ల భారత్ మెతక వైఖరి ? ఎఫ్ డీ ఐ పాలసీ సవరణపై వెనక్కి ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 21, 2020 | 4:51 PM

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీని సవరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా వెలిబుచ్చిన అభ్యంతరంతో కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రపంచ వాణిజ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలను భారత్ అతిక్రమిస్తోందని  చైనా చేసిన ఆరోపణను కొట్టి పారేస్తూనే.. మరోవైపు.. ఈ సవరణ.. అనుమతిని తిరస్కరించినట్టుగా భావించరాదని, ఇది ఆమోద ప్రక్రియ మాత్రమేనని తాజాగా స్పష్టం చేసింది. అంతే తప్ప ఇందులో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ఉల్లంఘన ప్రసక్తే లేదని పేర్కొంది. ఇది పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం మాత్రమేనని, మన దేశాల పరస్పర వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా తమ దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో చైనా కంపెనీలు భారత కంపెనీలపై కన్ను వేశాయని, వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటిని టేకోవర్ చేయడానికి కుయుక్తి పన్నాయని వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం అత్యవసరంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గల పాలసీని సవరించింది. ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ విదేశమూ ఇక్కడి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేకుండా  ఈ విధానాన్ని సవరించారు. ఇండియాతో సరిహద్దులను పంచుకునే దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని ఈ సవరణలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ నెల 12 న తను చేసిన ట్వీట్ లో ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు కూడా.