అక్కడ యువత ప్రాణాలే ఎక్కువగా తీసుకుంటోన్న ‘కరోనా’..!

| Edited By:

May 22, 2020 | 6:02 PM

వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికే కరోనా వైరస్ పెను శాపంగా మారినట్లు ఇప్పటి వరకు వెల్లడైన చాలా గణాంకాలు చెప్పాయి. అయితే లాటిన్ అమెరికన్‌ దేశమైన బ్రెజిల్‌లో ఈ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ఎక్కువగా యువతే కరోనాతో చనిపోతున్నారట. అందుకు అక్కడి యువత కరోనాను సీరియస్‌గా తీసుకోకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకకుండా ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను అక్కడి యువత అస్సలు పట్టించుకోవడం లేదని, ఉపాధి కోసం వారు బయటకు […]

అక్కడ యువత ప్రాణాలే ఎక్కువగా తీసుకుంటోన్న కరోనా..!
Follow us on

వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికే కరోనా వైరస్ పెను శాపంగా మారినట్లు ఇప్పటి వరకు వెల్లడైన చాలా గణాంకాలు చెప్పాయి. అయితే లాటిన్ అమెరికన్‌ దేశమైన బ్రెజిల్‌లో ఈ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అక్కడ ఎక్కువగా యువతే కరోనాతో చనిపోతున్నారట. అందుకు అక్కడి యువత కరోనాను సీరియస్‌గా తీసుకోకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా సోకకుండా ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను అక్కడి యువత అస్సలు పట్టించుకోవడం లేదని, ఉపాధి కోసం వారు బయటకు వెళ్లడం వలన వైరస్‌ బారిన ఎక్కువగా పడుతున్నారని ఓ వైద్య నిపుణులు మీడియాకు వెల్లడించారు. ఇక ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలు కూడా కారణమని పలువురు విమర్శిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో విరుద్ధ నిర్ణయాల వలన యువత విధుల్లోకి వెళ్తోందని, అందుకే వైరస్ తీవ్రత వారిలోనే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అందులోనూ పేదరికం ఎక్కువగా ఉండటంతో యువత కడుపు నింపుకోవడానికి బయటకు వెళ్లాల్సి వస్తోందని వారు అంటున్నారు. కాగా బ్రెజిల్‌లో 31లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 20వేల మందికి పైగా మరణించారు. ఇక కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని విమర్శిస్తూ.. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని అత్యున్నత పదవికి క్రోడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: ‘బిగ్‌బాస్‌ 4’.. ఆ నలుగురు ఫిక్స్‌ అయ్యారా..!