లాక్డౌన్ వేళ ఏపీలో రెండు వేర్వేరు చోట్ల రెండు అనుకొని అగ్రి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం కాగా, ఆస్తి నష్టం సంభవించింది. వివరాల్లోకెళితే …
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. పెంటపాడు సమీపంలో ధైనాల్ క్లోరైడ్ డబ్బాల లోడ్ తో వెళ్ళుతున్న టాటాఏస్ వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొనగా మంటల వ్యాప్తి చెంది ఇద్దరు మంటల్లో చిక్కుకుపోయారు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని అలంపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
తాడేపల్లిగూడెం నుండి తణుకు వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఫినాయిల్ ఆల్కహాల్ బారెల్ కెమికల్ లోడ్ తో వెళ్ళుతున్న వాహనం చెట్టును డీకొంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. తాడేపల్లిగూడేం,తణుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాప్తి చెందడంతో క్యాభిన్ లో నుండి ఆర్తనాదాలు రావడంతో చెక్ పోస్ట్ నిర్వహిస్తున్న పోలీసులు, స్థానికులు అక్కడకు వెళ్ళినా రక్షించలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. వాహనం పూర్తిగా దగ్దం కావడంతో గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు.
అటు విజయవాడలోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ వైన్షాప్లో మంటలు చెలరేగి ఆస్తినష్టం వాటిల్లింది. గూడవల్లిలోని ప్రభుత్వ వైన్ షాపులో మంటలు వ్యాప్తించాయి. మద్యం షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణంలోని ఫర్నిచర్, కంప్యూటర్, ప్రింటర్ ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. జరిగిన ప్రమాదం వెనుక మందుబాబుల హస్తం ఉందా, లేదంటే, షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.