ప్రపంచమంతా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నారు. కాగా డీ విటమిన్ ఎక్కువ ఉన్న వారు కరోనా నుంచి బతికి బయట పడతారని ఇంగ్లండ్లోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ విటమిన్ తక్కువగా ఉన్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలపాలై చివరకు మరణించే ప్రమాదం కూడా ఉందని వారి పరిశోధనల్లో తేలింది. కాగాప్రజల్లో డీ విటమిన్ తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమ్స్టర్డామ్లోని వ్రిజి యూనివర్శిటీ జరిపిన పరిశోధనల్లో సైతం తేలింది. అంతేకాదు విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో 50 శాతం మందికి ఛాతీపరమైన ఇన్ఫెక్షన్లు తగ్గాయని ‘యూనివర్శిటీ ఆఫ్ గ్రెనడా’ జరిపిన పరిశోధనల్లో సైతం తేలింది. కాగా చేపలు, పుట్ట గొడుగులు తినడం ద్వారా డీ విటమిన్ శరీరానికి అందుతుంది. అంతేకాదు ఉదయం, సాయంత్రం సూర్యరర్శి తగలడం ద్వారా శరీరంలో డీ విటమిన్ తయారవుతుంది.
Read This Story Also: సిగరెట్ లేకుండా బర్త్డే చేసుకున్నా: అధ్యక్షుడిపై 116 ఏళ్ల వృద్ధుడు గరం