కరోనా వేళ కళ్యాణం..43 మందికి పాజిటివ్..కేసు నమోదు

|

Jul 27, 2020 | 1:20 PM

భారత్‌ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. మరోవైపు దేశంలో అన్‌లాక్ 2.0తో అనేక వాటికి తలుపులు తెరిచినట్లుకావడంతో పలు చోట్ల ప్రజలు వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

కరోనా వేళ కళ్యాణం..43 మందికి పాజిటివ్..కేసు నమోదు
Follow us on

భారత్‌ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఏ రోజుకారోజు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. మరోవైపు దేశంలో అన్‌లాక్ 2.0తో అనేక వాటికి తలుపులు తెరిచినట్లుకావడంతో పలు చోట్ల ప్రజలు వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా నిబంధనలు గాలికి వదిలేసి యద్దేచ్ఛగా వైరస్ వ్యాప్తికి కారకులుగా మారుతున్నారు. పెళ్లిళ్లు, పెరంటాలు, పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కేరళలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన వారిలో ఏకంగా 43 మంది వైరస్ బారినపడ్డారు.

కేరళ రాష్ట్రం కాసర్గోడ్‌లోని చెంగలాకు చెందిన ఓ వ్యక్తి జూలై 17న తన కూతురి వివాహం జరిపించాడు. వధువరుల తరపున పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే, వివాహ అనంతరం వధూవరులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పెళ్లికి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. వైరస్ లక్షణాలుంటే, సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంపద్రించాలని కోరారు. అనంతరం వారందరికీ టెస్టులు చేయగా, సుమారు 43 మందికి కరోనా సోకినట్లుగా తేలింది. దీనిపై కాసర్గోడ్ జిల్లా అథారిటీ కేసు నమోదు చేసింది. కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ కింద వధువు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇకపోతే, గత కొన్ని రోజులుగా కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి తిరిగి ఉధృతంగా మారుతోంది. కేరళలో ఆదివారం 927 కొవిడ్ -19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రెండు మరణాలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 9,655కు చేరింది.