హైదరాబాద్‌లో సెంచరీ క్రాస్.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎంతంటే..!

| Edited By:

Apr 04, 2020 | 7:48 PM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 250కు పెరిగింది. హైదరాబాద్‌లో కరోనా బాధితుల సంఖ్య సెంచరీ దాటి.. 105కు చేరింది

హైదరాబాద్‌లో సెంచరీ క్రాస్.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎంతంటే..!
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 250కు పెరిగింది. హైదరాబాద్‌లో కరోనా బాధితుల సంఖ్య సెంచరీ దాటి.. 105కు చేరింది. ఇక ప్రాంతాల వారిగా వరంగల్‌ అర్బన్‌లో 22, నిజామాబాద్‌ 18, కరీంనగర్‌ 17, రంగారెడ్డి 15, మేడ్చల్ 15, కామారెడ్డి 10, నల్లగొండ 07, ఆదిలాబాద్ 06, సంగారెడ్డి 06, మెదక్ 05, జోగులాంబ 04, భద్రాద్రి కొత్తగూడెం 04, వరంగల్ రూరల్ 03, నాగర్ కర్నూల్ 02, జగిత్యాల 02, జనగాం 02, సిద్ధిపేట్ 01, సూర్యాపేట్ 01, మహబూబ్‌నగర్‌ 01కేసులు ఉన్నాయి. మరోవైపు ఏపీలో ఇవాళ ఒక్క రోజే 10 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఐదు, గుంటూరులో మూడు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 190కు పెరిగింది.

Read This Story Also: కరోనా వైరస్‌: ఇంగ్లండ్ క్రికెటర్ల భారీ విరాళం