Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,745 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,35,953కి చేరింది. ఇందులో 21,878 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,07,318 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 13 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,757కు చేరుకుంది. ఇక నిన్న 2,292 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 218, చిత్తూరు 286, తూర్పుగోదావరి 407, గుంటూరు 297, కడప 125, కృష్ణా 398, కర్నూలు 38, నెల్లూరు 130, ప్రకాశం 124, శ్రీకాకుళం 91, విశాఖపట్నం 120, విజయనగరం 83, పశ్చిమ గోదావరి 428 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,614కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 790 మంది కరోనాతో మరణించారు.
#COVIDUpdates: 05/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,33,058 పాజిటివ్ కేసు లకు గాను
*8,04,423 మంది డిశ్చార్జ్ కాగా
*6,757 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 21,878#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DTJoMlPKHY— ArogyaAndhra (@ArogyaAndhra) November 5, 2020