ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు జనసేన పార్టీ ఓ పాటను రూపొందించింది. దీనిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ పాట ఇంత అద్భుతంగా మలిచిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కోటి, గీత రచయిత ప్రియాంక, ఇతర సహాయ బృందానికి నా ధన్యవాదాలు అని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాక కరోనాపై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘గబ్బర్ సింగ్’ సినిమా నటులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. కాగా, పవన్ కళ్యాణ్ కరోనాపై పోరాటంలో భాగంగా రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read:
చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్ను వేడుకోలు..
ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..
కరోనా తెచ్చిన తంటా.. అమెరికన్లలో పట్టుకున్న కొత్త భయం..
‘కరోనా వైరస్’ను మొదటగా కనుగొన్నది ఓ మహిళ.. ఆమె గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
(Cont..)
మ్యూజిక్ డైరెక్టర్ “శ్రీ కోటి” గీత రచయిత “ప్రియాంక” గార్లకు, మరియు ఇతర సహాయక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.https://t.co/RkxnFcdvMi— Pawan Kalyan (@PawanKalyan) April 17, 2020