దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించినప్పటికీ కేంద్రం కొన్ని మినహాయింపులను ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. ఈ నెల 20 నుంచి దేశంలో లాక్ డౌన్ను దశలవారీగా ఆంక్షలతో కూడిన సడలింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. లాక్ డౌన్ సమయంలో అనుమతులు మంజూరు చేసే పరిశ్రమలు కింది నిబంధనలను తప్పకుండా పాటించాలి..
* కార్మికులకు ఓన్లీ సింగల్ ఎంట్రీ పాయింట్స్ మాత్రమే పెట్టాలి.
* సామాజిక దూరాన్ని పాటించే వీలుగా తగిన స్థలం
* వలస కూలీల కోసం ప్రత్యేక రవాణాను ఏర్పాటు చేయడం.. లేదా ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే బస ఏర్పాటు చేయాలి.
* పరిశ్రమలో రెగ్యులర్గా శానిటేషన్ చేయాలి
* రాష్ట్ర, జిల్లా అధికారులు వీటికి అనుమతిచ్చేటప్పుడు.. అన్నీ నిబంధనలను పాటిస్తున్నారో లేదో తప్పక చూడాలి.
2. వివిధ మినిస్ట్రీ అఫ్ హోం ఎఫైర్స్(MHA) నోటిఫికేషన్ల క్రింద ఇప్పటివరకు అనుమతించబడిన కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమయ్యే అన్ని వాహనాలు, కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాలి.
3. టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ తయారీ వంటి రంగాలలో సరైన పారిశుధ్యం, సామాజిక దూరాన్ని పాటించే పెద్ద కంపెనీలు(సింగిల్ షిఫ్టులో 20% నుండి 25% సామర్థ్యంతో ప్రారంభించవచ్చు)
4. ఎగుమతి, దిగుమతులు చేసే పరిశ్రమలు లేదా ఎంఎస్ఎంఇలను కనీస మ్యాన్ పవర్ తో పనిచేయడానికి అనుమతించాల్సిన అవసరం ఉంది. ఇక పాసులు మంజూరు చేస్తున్నప్పుడు, సంబంధిత అధికారులు ఎగుమతుల వివరాలను ఎప్పుడూ తనిఖీ చేయాల్సి ఉంటుంది.
5. ఇక కింద చెప్పిన పరిశ్రమలు తక్కువ మంది వర్కర్లతో, సరైన పారిశుద్ధ్యం, ఒక షిఫ్ట్ ప్రాతిపదికన ప్రారంభించడానికి అనుమతించబడతాయి:
6. లాక్ డౌన్ సమయంలో అనుమతులు పొందిన పరిశ్రమలు షిఫ్ట్లను చాలా జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది. అంతేకాక షిఫ్ట్ ప్రారంభం, ముగింపు సమయాల్లో ఎక్కడా రద్దీ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
7. కార్మికులు.. తమకు తాము రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకునప్పుడు సైట్లలో పని చేసేందుకు గృహ, నిర్మాణ రంగాలు అనుమతించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వారి పూర్తి బాధ్యతను కాంట్రాక్టర్లు చూసుకోవాలి.
8. అన్ని రవాణా వాహనాలు… అవి ఇంటర్-స్టేట్, ఇంట్రా-స్టేట్ లేదా ఇంట్రా- సిటీ అయినా, ఖాళీగా లేదా నిండి ఉన్నా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఎటువంటి ప్రశ్నా అడగకుండానే అనుమతించాలి.
9. వీధుల్లో బండ్ల మీద కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్ళను ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది. వీరి వల్ల అన్ని నిత్యావసర వస్తువులు ప్రజలకు ఇంటి వద్దకే సమకూర్చబడతాయి.
10. మొబైల్ రిపేర్, టీవీ, ఫ్రిడ్జ్లను రిపేర్ చేసే షాపులు, ప్లంబర్లు, చెప్పులు కుట్టేవాళ్ళు, ఇస్త్రీ (ధోబి), ఎలక్ట్రీషియన్, ఆటోమొబైల్ మెకానిక్స్, సైకిల్ రిపేర్ మెకానిక్స్ వంటి వారిని అనుమతించాలి. అయితే, ఈ వ్యక్తులు తమ ఐడీ కార్డులను ఎలప్పుడూ తమ దగ్గరే ఉంచుకోవాలి. అంతేకాక ఇలాంటి రిపేర్ సేవలను అందించే ఇ-కామర్స్ సంస్థలను కూడా అనుమతించవచ్చు.
11. చిన్న, మధ్య తరహ పరిశ్రమలకుమినహాయింపు.
12. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలన్నింటికి అనుమతులు