Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,86,852కి చేరింది. ఇందులో 1473 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,78,232 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7147కు చేరుకుంది. ఇక నిన్న 172 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,28,31,731 సాంపిల్స్ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 11, చిత్తూరు 10, తూర్పుగోదావరి 35, గుంటూరు 12, కడప 7, కృష్ణా 23, కర్నూలు 5, నెల్లూరు 1, ప్రకాశం 2, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 18, విజయనగరం 1, పశ్చిమ గోదావరి 28 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 23/01/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,83,957 పాజిటివ్ కేసు లకు గాను
*8,75,337 మంది డిశ్చార్జ్ కాగా
*7,147 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,473#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/hTnGrSnfoE— ArogyaAndhra (@ArogyaAndhra) January 23, 2021