ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య

|

Jul 23, 2020 | 4:49 PM

నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి పై నుంచి దూకి కరోనా బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది..

ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య
Follow us on

హైదరాబాద్‌ నగరంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి పై నుంచి దూకి కరోనా బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్ అమీర్‌పేట్‌కు చెందిన నాగేందర్ అనే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబీకులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే అతడు గురువారం ఉదయం ఆస్పత్రి పై నుంచి దూకేశాడు. పక్కనే ఉన్న చెట్ల మీదపడిపోయాడు. అది గమనించిన స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే అతడే తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతుడు నాగేంద్ర ఎయిర్స్‌ ఫోర్స్‌లో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.