అశ్రు నయనాల మధ్య కల్నల్ సంతోష్‌ అంత్యక్రియలు పూర్తి…

| Edited By:

Jun 18, 2020 | 12:22 PM

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సంతోష్ బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రొటోకాల్ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించారు. సంతోష్‌కి మిలటరీ చేసిన సేవలకు గుర్తుగా అధికారులు యూనిఫామ్...

అశ్రు నయనాల మధ్య కల్నల్ సంతోష్‌ అంత్యక్రియలు పూర్తి...
Follow us on

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సంతోష్ బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రొటోకాల్ ప్రకారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియ కార్యక్రమాలు నిర్వహించారు ఆర్మీ అధికారులు. సంతోష్‌కి మిలటరీ చేసిన సేవలకు గుర్తుగా అధికారులు యూనిఫామ్, అతని టోపీని భార్య సంతోషికి అందించారు. కల్నల్ సంతోష్ బాబు పార్థీవ దేహానికి సైనికులు తుపాకి గౌరవ వందనం చేశారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం సంతోష్ తండ్రి ఉపేందర్ అంతిమ సంస్కారాలు నిర్వహించగా, ఆయన వెంట సంతోష్ భార్య సంతోషితో పాటు కుమారుడు ఉన్నారు. కుమారుడి చేత సంతోష్ పార్థివ దేహాం ఉన్న చితికి నిప్పంటించారు.

కాగా సంతోష్ అంతిమయాత్రను అతని నివాసం నుంచి.. కేసారం గ్రామ సమీపం వరకూ 5.5 కిలో మీటర్లు సాగింది. మిలటరీ వాహనంలో ఆయన పార్థీవ దేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు. వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌ను చూసేందుకు వచ్చేవారికి.. కరోనా నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు చేశారు అధికారులు.

సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమ యాత్ర సాగింది. కాగా అడుగడుగునా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నివాళులు అర్పించారు. ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ, జాతీయ జెండాలు పట్టుకుని సంఘీభావం ప్రకటించారు. సూర్యా పేట పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌‌ను పాటించారు.