తెలంగాణలో కొత్తగా మరో 1831 కేసులు.. 11 మంది మృతి..

| Edited By:

Jul 06, 2020 | 9:59 PM

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. తాజాగా సోమవారం నాడు కొత్తగా మరో 1,831 కరోనా..

తెలంగాణలో కొత్తగా మరో 1831 కేసులు.. 11 మంది మృతి..
Follow us on

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. తాజాగా సోమవారం నాడు కొత్తగా మరో 1,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 11 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 306కి చేరింది. ఇక సోమవారం నాడు కరోనా నుంచి కోలుకుని 2,078 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 14,751కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10,646 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. సోమవారం నాడు కూడా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 1,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.