బీహార్లో ముగిసిన తుది విడత ఎన్నికల ప్రచారం
దేశ వ్యాప్తంగా అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఇవాళ సాయంత్రంతో గడువు ముగిసింది.. మొత్తం 78 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది.. మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ సభలలో పాల్గొన్నారు.. మారుమూల జిల్లాలలో కూడా ఆయన పర్యటించారు. మొత్తం 12 ఎన్నికల సభలలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. బీజేపీ సీనియర్ నేతలు రాజ్నాథ్సింగ్, జెపీ నడ్డా, యోగి […]
దేశ వ్యాప్తంగా అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఇవాళ సాయంత్రంతో గడువు ముగిసింది.. మొత్తం 78 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది.. మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ సభలలో పాల్గొన్నారు.. మారుమూల జిల్లాలలో కూడా ఆయన పర్యటించారు. మొత్తం 12 ఎన్నికల సభలలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. బీజేపీ సీనియర్ నేతలు రాజ్నాథ్సింగ్, జెపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్లు కూడా ప్రచార సభలలో పాల్గొన్నారు. ఇక మహాగడ్బంధన్ తరఫున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మాధేపుర, అరారియా జిల్లాలలో జరిగిన ఎన్నికల సభలలో పాల్గొన్నారు.. ఈవీఎంలను మోదీ ఓటింగ్ మెషిన్లంటూ ఎద్దేవా చేశారు. అధికారం నిలుపుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నితీశ్కుమార్, అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ధ్యేయంతో తేజస్వీ యాదవ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఇవే తన చివరి ఎన్నికలంటూ ఓటర్ల సానుభూతి పొందడానికి నితీశ్ ప్రయత్నిస్తున్నారు. లోక్జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ సభలకు కూడా జనం భారీగా రావడంతో ఇటు ఎన్డీఎ, అటు మహాగడ్బంధన్లలో గుబులు మొదలయ్యింది.. చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందో తెలియడం లేదు. ఇక ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే సీమాంచల్లో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేశారు.. ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరుగుతుంది.