రూ.3,500 కోట్లను వ్యక్తిగత సంస్థలకు ఇచ్చిన వీజీ సిద్ధార్థ

| Edited By:

Jul 28, 2020 | 2:21 PM

దేశంలో అతి పెద్ద కాఫీ చైన్ కేఫ్‌ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలకు సంబంధించి కేఫ్‌ కాఫీ డే అంతర్గత విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ఇన్వెస్టిగేషన్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది.

రూ.3,500 కోట్లను వ్యక్తిగత సంస్థలకు ఇచ్చిన వీజీ సిద్ధార్థ
Follow us on

VG Siddhartha: దేశంలో అతి పెద్ద కాఫీ చైన్ కేఫ్‌ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలకు సంబంధించి కేఫ్‌ కాఫీ డే అంతర్గత విచారణ కోసం ఇద్దరు సభ్యులతో ఇన్వెస్టిగేషన్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక విచారణలో భాగంగా కాఫీ డే గ్రూప్ నుంచి రూ3,535కోట్ల రూపాయలు సిద్ధార్థ వ్యక్తిగత సంస్థలకు వెళ్లినట్లు బృందం వెల్లడించింది. అంతేకాదు ఐటీ శాఖ, సిద్ధార్థపై ఒత్తిడి తెచ్చిందంటూ ఆరోపణలు రాగా.. ఆ విషయంలో ఐటీ శాఖకు క్లీన్ చిట్ ఇచ్చింది.

సిద్ధార్థ కుటుంబానికి చెందిన మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్‌, సీసీడీ(కేఫ్ కాఫీ డే) నుంచి రూ.3,535 కోట్లు తీసుకున్నట్లు గుర్తించామని సీబీఐ మాజీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. ఇక 2019 మార్చి 31 లెక్కల ఆడిట్ లెక్కల ప్రకారం సిద్ధార్థ అనుబంధ సంస్థల ద్వారా రూ.842కోట్లు వచ్చాయని, మిగిలిన 2,693 కోట్లు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దాన్ని రికవరీ చేస్తామని దర్యాప్తు బృందానికి, కాఫీ డే కంపెనీ తెలిపింది. కాగా ఈ బృందం దాదాపు ఏడాది పాటు ఈ కేసులో విచారణ జరుపుతోంది. వీజీ సిద్ధార్థ సంస్థల నుంచి డబ్బు తిరిగి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, గతంలో వెల్లడించిన 8.4 బిలియన్‌ డాలర్ల బాకీలు ఉన్నట్లు తెలిపింది.

Read This Story Also: మోదీ పిలుపు.. తయారైన 6,940 యాప్‌లు