భారతదేశ ఆటో మొబైల్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్కు ప్రత్యేక ఫ్యాన్ బేస్. ఈ కారును ఎక్కువగా రాజకీయ నాయకులు అమితంగా ఇష్టపడతారు. మార్కెట్లో అధునాతన ఫీచర్లతో ఎన్ని కార్లు వచ్చినా ఈ కారు సేల్స్ మాత్రం పడలేదంటే ఫార్చ్యూనర్ క్రేజ్ను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఫార్చ్యూనర్ కారుకు పోటీగా నిస్సాన్ మోటార్ ఇండియా ఎక్స్ ట్రైల్ పేరుతో జూలై 17న సరికొత్త కారును మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్-ట్రయిల్ ఫోర్ట్ జనరేషన్ సీబీయూతో వస్తుందని కంపెనీ ప్రకటించింది. సీబీయూతో మాగ్నైట్ తర్వాత నిస్సాన్ కార్లలో ఎక్స్- ట్రైల్ రెండో కారుగా నిలిచింది. ఈ కారు భారత మార్కెట్లో స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్లకు పోటీగా నిలుస్తుందని నిస్సాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిస్సాన్ ఎక్స్-ట్రయల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ఇండియన్ మార్కెట్లో మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. సాలిడ్ వైట్, డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. నిస్సాన్ ఎక్స్-ట్రైల్లో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 162 బీహెచ్పీ శక్తిని, 300 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్పుట్ను విడుదల చేస్తుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్తో వస్తుంది. అలాగే 12వీ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, ఎక్స్-ట్రైల్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్స్ డిస్ ప్లే, వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ చేయడానికి పుష్ బటన్తో కూడిన కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి వాటితో అధునాతంగా ఉంటుంది.
నిస్సాన్ ఎక్స్-ట్రైల్లో భద్రతా ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఆటోమేటిక్ వైపర్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, ఏడు ఎయిర్ బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్, పరిమిత-స్లిప్ డిఫరెన్షియల్ ఫీచర్లు మరింత ఆకర్షిస్తాయి. ఎక్స్ -ట్రైల్ పొడవు 4,680 ఎంఎం, వెడల్పు 1,840 ఎంఎం, ఎత్తు 1,725 ఎంఎంగా ఉంది. అలాగే వీలే బేస్ 2,705 మి.మీగా ఉండగా ఈ కారు 7-సీటర్ ఎస్యూవీగా ఉంది. 5.5 మీటర్ల టర్నింగ్ రేడియస్, 210 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ రైడర్లను మరింత ఆకర్షిస్తుంది. ఎక్స్-ట్రైల్ సుమారు 40 లక్షల (ఎక్స్-షోరూమ్) మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి