విత్తనాలు నాటబోతే వజ్రం దొరికింది..!

|

Jul 08, 2020 | 2:46 PM

అదృష్టం చెప్పిరాదు.. దురదృష్టం చెప్పి పోదు అంటారు పెద్దలు. కూలీ పని చేసుకుంటున్న ఓ మహిళకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. ఒక్కరోజులోనే కూలీని లక్షాధికారిణి చేసింది. వేరుశెనగ విత్తనాలు నాటబోతే వజ్రం చేతికి తగిలింది. దీంతో మహిళ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.

విత్తనాలు నాటబోతే వజ్రం దొరికింది..!
Follow us on

అదృష్టం చెప్పిరాదు.. దురదృష్టం చెప్పి పోదు అంటారు పెద్దలు. కూలీ పని చేసుకుంటున్న ఓ మహిళకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. ఒక్కరోజులోనే కూలీని లక్షాధికారిణి చేసింది. వేరుశెనగ విత్తనాలు నాటబోతే వజ్రం చేతికి తగిలింది. దీంతో మహిళ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.
తుగ్గలి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇందులో భాగంగా వేరుశనగ విత్తనం విత్తేందుకు వెళ్లింది. మహిళా కూలీకి వజ్రం కంట పడడంతో ఆగి తీసుకుంది. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంటనే అమ్మాలని నిర్ణయించుకున్నారు. దీంతో 5 క్యారెట్లకు పైగా ఉన్న ఈ వజ్రాన్ని అదే రోజు రాత్రి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారికి అమ్మేసింది. ఆ మహిళకు రూ.5.50 లక్షల నగదు, 3తులాల బంగారం ఇచ్చి పంపించాడు ఆ వ్యాపారి. అనుకోకుండా వచ్చిన సొమ్ముతో ఆ మహిళ కుటుంబం అనందంలో మునిగిపోయింది.