మోదీ ప్రమాణ స్వీకారం.. దీదీ సంచలన నిర్ణయం

|

May 28, 2019 | 8:07 PM

సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు బద్ద శత్రువుల మాదిరి తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా దీదీ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 30వ తేదీని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ ఆహ్వానాన్ని మమత అంగీకరించారు. కాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తాను ఇతర రాష్ట్రాల […]

మోదీ ప్రమాణ స్వీకారం.. దీదీ సంచలన నిర్ణయం
Follow us on

సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు బద్ద శత్రువుల మాదిరి తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా దీదీ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 30వ తేదీని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ ఆహ్వానాన్ని మమత అంగీకరించారు. కాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తాను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడానని.. ఇది ప్రధానిమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి.. హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు మమత స్పష్టం చేశారు.

మరోవైపు రాజకీయపరంగా తృణమూల్, బీజేపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం తృణమూల్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, 50 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.