విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మృతులకు ఐక్యరాజ్యసమితి సంతాపం తెలిపింది. 12 మంది మృతికి కారణమైన ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. భారత అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ప్రకటన రిలీజ్ చేశారు.
“గ్యాస్ లీకేజీ ఘటనలో మృతులకు సంతాపం తెలుపుతున్నాం. ఘటనతో ప్రభావితమైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తులు జరగాలి” అని స్టెఫానీ డుజారెక్ పేర్కొన్నారు.
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్లో గురువారం తెల్లవారుజామున విషవాయువు లీకైయిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు