Telangana Corona Cases : తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,896 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా సోకినవారి సంఖ్య 82,647కి చేరింది. సోమవారం కరోనాతో కొత్తగా 8 మృతి చెందగా.. మొత్తం చనిపోయినవారి సంఖ్య 645కి చేరింది. వ్యాధి బారి నుంచి సోమవారం 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాధిని జయించిన వారి సంఖ్య 59,374కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,628 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో వెల్లడించింది. ఇక తెలంగాణలో 6,42,875మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసులు
జీహెచ్ఎంసీ పరిధిలో 338
రంగారెడ్డి జిల్లాలో 147
కరీంనగర్ 121
మేడ్చల్ 119
వరంగల్ అర్బన్ 95
గద్వాల 85
జనగామ 71
కామారెడ్డి 71
ఖమ్మం 65
భద్రాద్రి 60
పెద్దపల్లి 66
సిద్ధిపేట 64
Also Read : తెలంగాణ : రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్లు విడుదల