‘దిశ ఎన్‌కౌంటర్‌’ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ, ట్రైలర్ అప్డేట్

|

Sep 25, 2020 | 12:58 PM

హైదరాబాద్ లో ఏడాది క్రితం సంచలనం రేపింది వెటర్నరీ డాక్టర్‌ దిశ అత్యాచార ఘటన. ఈ కేసులో నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఈ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇవాళ కొత్త అప్డేట్ ఇచ్చారు వర్మ. న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంలో.. ఈ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 9.08 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను నట్టి […]

దిశ ఎన్‌కౌంటర్‌ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ, ట్రైలర్ అప్డేట్
Follow us on

హైదరాబాద్ లో ఏడాది క్రితం సంచలనం రేపింది వెటర్నరీ డాక్టర్‌ దిశ అత్యాచార ఘటన. ఈ కేసులో నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఈ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇవాళ కొత్త అప్డేట్ ఇచ్చారు వర్మ. న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంలో.. ఈ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 9.08 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు.

ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, నవంబర్‌ 26 తేదీనే ఈ ఘటనను సినిమాగా తెరకెక్కిస్తానని వర్మ తెలిపారు. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు పోలీస్ కాల్పులలో మరణించిన ఘటనతో ఈ సినిమా పూర్తవుతుంది.