త్రివిధ దళాల అధిపతులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష

|

Jul 10, 2020 | 4:53 PM

భారత్, చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా త్రివిధ దళాల అధిపతులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

త్రివిధ దళాల అధిపతులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష
Follow us on

భారత్, చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా త్రివిధ దళాల అధిపతులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో ఘర్షణల అనంతరం నెలకొన్న వాతావరణం పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ నరవాణే, నేవీ చీఫ్ కరంవీర్ సింగ్, వాయుసేన చీఫ్ బధూరియాతో పాటు సీనియర్లు హాజరయ్యారు. గాల్వాన్ వ్యాలీ, గోర్గా, తదితర ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కి తగ్గడంపై నరవాణే ఓ సమగ్ర రిపోర్టు సమర్పించినట్లు సమాచారం. మరోవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గేందుకు ఇరు వర్గాలకు చెందిన రక్షణ విభాగం అధికారులు వర్చుల్ పద్ధతిలో సమావేశమవుతున్నారు. మరోవైపు రెండు దేశాలకు చెందిన ఆర్మీ బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు.