శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం 8: 30 గంటల ప్రాంతం లో వరుస బాంబు పేలుళ్లలు జరిగాయి. ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు ఈ దాడులకు పాల్పడ్డారు . కొలంబో లోని మొత్తం ఆరు ప్రాంతాల్లో బ్లాస్టింగ్ జరిగినట్లు సమాచారం. అందులో కొలంబోలోని సిన్నామన్ గ్రాండ్ హోటల్ కూడా ఒకటి. ఇక ఈ ఘటన నుండి త్రుటి లో బయటపడ్డారు సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.
సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో స్టే చేసిన రాధికా ఈ ఘటన జరిగే కొద్దీ నిమిషాల ముందు ఆమె ఈ హెటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న రాధిక షాకింగ్ గా ఉందని నేను హోటల్ ను ఖాళీ చేసిన కొద్దీ సేపటికే బ్లాస్టింగ్ జరిగింది . దేవుడు అందరి తో ఉండాలని అని ఆమె ట్వీట్ చేశారు.
So shocked https://t.co/HvQmkGW8ED
— Radikaa Sarathkumar (@realradikaa) April 21, 2019