కేంద్ర బడ్జెట్లో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో రెండోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. 2020 కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఆమె వివిధ శాఖలకు బడ్జెట్లను కేటాయించారు. అవి:
1. వ్యవసాయరంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు
2. గ్రామీణాభివృద్ధికి రూ.1.23 లక్షల కోట్లు కేటాయింపు
3. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి రూ.103 లక్షల కోట్లు
4. పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ.27,300 కోట్లు
5. విద్యారంగానికి రూ.99,300 కోట్లు
6. ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు
7. నేషనల్ టెక్స్టైల్స్ మిషన్కు రూ.1480 కోట్లు
8. నైపుణ్యశిక్షణకు రూ.3 వేల కోట్లు
9. జల్జీవన్ మిషన్కు రూ.3.06 లక్షల కోట్లు
10. స్వచ్ఛభారత్కు రూ.12,300 కోట్లు
11. ఆయుష్మాన్భవ పథకానికి రూ.6 వేల కోట్లు
12. భారత్ నెట్కు రూ.6వేల కోట్లు
13. రవాణారంగానికి రూ.1.70 లక్షల కోట్లు
14. మహిళా సంక్షేమానికి రూ.28,600 కోట్లు
15. పౌష్టిక ఆహారానికి రూ.35 వేల కోట్లు
16. ఎస్సీలు, వెనుకబడిన తరగతుల కోసం రూ.8,500 కోట్లు
17. పవర్, రెన్యూవన్ ఎనర్జీ రంగానికి రూ.22 వేల కోట్లు
18. క్లైమేట్ చేంజ్ పాలసీ కోసం రూ.4,400 వందల కోట్లు
19. క్లీన్ ఎయిర్ పాలసీ కోసం రూ.4,400 కోట్లు
20. ఎస్సీలకు రూ.85 వేల కోట్లు
21. దివ్యాంగులకు రూ.9,500 కోట్లు
22. సాంస్కృతిక శాఖకు రూ.3,150 కోట్లు
23. జీ 20 సదస్సు నిర్వహణ కోసం రూ.100 కోట్లు
24. పర్యాటక రంగానికి రూ.2,500 కోట్లు
25. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం 30,750 కోట్లు
26. లద్దాఖ్ అభివృద్ధికి రూ.5,958 కోట్లు