ప్రజా సమస్యల కోసమే ప్రభుత్వానికి సూచనలు చేశా: రఘురామ

|

Jul 16, 2020 | 3:04 PM

పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, ప్రజలు దూరం కాకూడదని ప్రభుత్వానికి సూచనలు చేసానని, పార్టీకి.. ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని చెబుతున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలిశారు.

ప్రజా సమస్యల కోసమే ప్రభుత్వానికి సూచనలు చేశా: రఘురామ
Follow us on

పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, ప్రజలు దూరం కాకూడదని ప్రభుత్వానికి సూచనలు చేసానని, పార్టీకి.. ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని చెబుతున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తానెప్పుడు పార్టీకి గానీ, పార్టీ అధ్యక్షునికి గానీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ గా ఉన్నందున సలహాలు సూచనల కోసం రాజ్ నాథ్ సింగ్ ను కలిసానని.. రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు. తిరుపతి భూముల విషయం, ఇసుకలో జరుగుతున్న అక్రమాలకు గురించి మాట్లాడానన్నారు. పార్టీ మారుతున్నారన్న వార్తలను ఖండించిన రఘురామకృష్ణంరాజు సొంత పార్టీని ఎప్పుడు విమర్శించలేదని, మీడియానే మా సంసారంలో నిప్పులు వేయాలని చూస్తోందన్నారు. వైసీపీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని రఘురామ స్పష్టంచేశారు. అనర్హత పిటిషన్ లో కార్టూన్లు జోకులు తప్ప ఏమి లేవని కొట్టిపారేశారు రఘురామకృష్ణ రాజు.