యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఘట్టం జోరుగా హుషారుగా సాగింది. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అన్నిచోట్లా ప్రశాంతంగా జరిగింది. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ – ఫ్లోరిడా రిసార్ట్ సమీపంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాస్క్ ధరించకుండా ఓటింగ్ లో పాల్గొన్న మొలానియా పాం బీచ్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
First lady Melania Trump votes in Palm Beach, Florida, saying she wanted to cast her ballot on Election Day. https://t.co/NvzQCkhxlA pic.twitter.com/FZfgZZoXyz
— World News Tonight (@ABCWorldNews) November 3, 2020