ఆవు అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు

|

Jul 08, 2020 | 5:32 PM

దేశంలో మహిళలపై వరుసగా లైంగిక దాడులకు పాల్పడుతున్న కామాంధులు మూగజీవాలను సైతం వదలడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ కిరాతకుడు ఆవును అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడని అదుపులోకి తీసుకున్నారు.

ఆవు అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు
Follow us on

దేశంలో మహిళలపై వరుసగా లైంగిక దాడులకు పాల్పడుతున్న కామాంధులు మూగజీవాలను సైతం వదలడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ కిరాతకుడు ఆవును అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడని అదుపులోకి తీసుకున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని సుంద‌ర్‌న‌గ‌ర్ ప్రాంతంలో ఈనెల 4న పశువుల పాకలోకి చొర‌బ‌డి స‌బ్బీర్ అలీ అనే 55 ఏళ్ల వ్య‌క్తి ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆవు అరుపులు విన్న ఇంటి య‌జ‌మ‌ని అక్క‌డి వెళ్లి చూడ‌గా నిందితుడు పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన యాజమాని సీసీ ఫుటేజీ చెక్ చేశాడు. ఆవుపై దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డట్లు గుర్తించాడు. ఈ ఘటనపై అశోక్ గార్డెన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆవుపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. అత‌నిపై సెక్ష‌న్ 377 కింద కేసు న‌మోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్లు భోపాల్ ఇన్‌చార్జి శ్రీ వాస్త‌వ అన్నారు.