యోగాతో కరోనాకు చెక్ పెట్టొచ్చంటున్న రెబల్ స్టార్

|

Jun 20, 2020 | 8:32 PM

యోగాతో రోగ నిరోదక శక్తి పెంచుకోవచ్చంటున్నారు రెబల్ స్టార్, బీజేపీ నాయకులు కృష్ణంరాజు దంపతులు. జూన్ 21, ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారు ఓ వీడియోను విడుదల చేశారు. యోగా సాధన చేయటం వల్ల కలిగే లాభాలను వివరించారు. యోగతో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతుందో చెప్పారు. దానికి కొన్ని యోగాసనాలు వేయాలని వారు తెలిపారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయని అన్నారు. తన అర్ధాంగి శ్యామలాదేవితో కలిసి పలు ఆసనాలు […]

యోగాతో కరోనాకు చెక్ పెట్టొచ్చంటున్న రెబల్ స్టార్
Follow us on

యోగాతో రోగ నిరోదక శక్తి పెంచుకోవచ్చంటున్నారు రెబల్ స్టార్, బీజేపీ నాయకులు కృష్ణంరాజు దంపతులు. జూన్ 21, ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారు ఓ వీడియోను విడుదల చేశారు. యోగా సాధన చేయటం వల్ల కలిగే లాభాలను వివరించారు. యోగతో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతుందో చెప్పారు. దానికి కొన్ని యోగాసనాలు వేయాలని వారు తెలిపారు.

ఇమ్యూనిటీ పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయని అన్నారు. తన అర్ధాంగి శ్యామలాదేవితో కలిసి పలు ఆసనాలు వేసి చూపించారు. యోగాతో మనశ్శాంతిగా ఉండడమే కాకుండా కరోనా వంటి ప్రమాదకర వైరస్ ల నుండి రక్షించుకొనే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వివరించారు. ప్రాణక్రియ, కపాలభాతి అనే యోగా ప్రక్రియలను కృష్ణంరాజు దంపతులు ప్రదర్శించారు. కృష్ణంరాజు దంపతులు చేసిన వీడియోకు షేర్లు, లైక్స్ పెరిగిపోతున్నాయి.