కేదార్‌నాథ్‌ యాత్రికులు మిస్సింగ్.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు..

| Edited By:

Jul 16, 2020 | 6:30 AM

ఉత్తరాఖంఢ్‌లోని కేదార్‌నాథ్‌ ధామ్‌ను సందర్శించేందుకు వచ్చిన నలుగురు యాత్రికులు గల్లంతయ్యారు. కేదార్‌నాథ్‌ నుంచి వాసుకీతాల్-త్రియుగీనారాయణ్‌కు నడకమార్గాన వెళ్లారు. ఈ క్రమంలో వారు తప్పిపోయారు. దీంతో..

కేదార్‌నాథ్‌ యాత్రికులు మిస్సింగ్.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు..
Follow us on

ఉత్తరాఖంఢ్‌లోని కేదార్‌నాథ్‌ ధామ్‌ను సందర్శించేందుకు వచ్చిన నలుగురు యాత్రికులు గల్లంతయ్యారు. కేదార్‌నాథ్‌ నుంచి వాసుకీతాల్-త్రియుగీనారాయణ్‌కు నడకమార్గాన వెళ్లారు. ఈ క్రమంలో వారు తప్పిపోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన మూడు బృందాలు యాత్రికుల ఆచూకీ కోసం సమీప అడవిలో గాలిస్తున్నాయి. సర్చ్ ఆపరేషన్‌లో భాగంగా హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే భారీ వర్షాలతో పాటు.. దట్టమైన పొగమంచు కారణంగా గాలింపుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు.. ఎన్డీఆర్‌ఎఫ్,లోకల్ గైడ్స్ ఇలా మూడు టీంలుగా విడిపోయి గాలింపు చేపడుతున్నారు. రెండు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వీరి ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రయాగ్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని.. యాత్రికుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.