ఆర్టీసీ సమ్మెలోకి అమిత్‌షా ఎంట్రీ…జెఎసీ అనూహ్య నిర్ణయం

|

Nov 02, 2019 | 5:00 PM

ఆర్టీసీ సమ్మె కొత్త మార్గంలో మరింత జోరుకానుందా ? ఆర్టీసీ జెఎసీ తీసుకున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్దమవుతున్నట్లే కనిపిస్తోంది. కార్మికులంతా కలిసి ఉద్యమించడంతోపాటు ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థి, మహిళా సంఘాలను కూడా కలుపుకుని ప్రభుత్వంపై సమరం సాగించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసీ శనివారం నిర్ణయించింది. వచ్చే వారమంతటికి యాక్షన్ ప్లాన్‌ను ఫైనలైజ్ చేసిన జెఎసీ… అనూహ్యంగా ఆర్టీసీ సమ్మె […]

ఆర్టీసీ సమ్మెలోకి అమిత్‌షా ఎంట్రీ...జెఎసీ అనూహ్య నిర్ణయం
Follow us on
ఆర్టీసీ సమ్మె కొత్త మార్గంలో మరింత జోరుకానుందా ? ఆర్టీసీ జెఎసీ తీసుకున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్దమవుతున్నట్లే కనిపిస్తోంది. కార్మికులంతా కలిసి ఉద్యమించడంతోపాటు ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థి, మహిళా సంఘాలను కూడా కలుపుకుని ప్రభుత్వంపై సమరం సాగించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జెఎసీ శనివారం నిర్ణయించింది.
వచ్చే వారమంతటికి యాక్షన్ ప్లాన్‌ను ఫైనలైజ్ చేసిన జెఎసీ… అనూహ్యంగా ఆర్టీసీ సమ్మె అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించింది. నవంబర్ 4,5 తేదీలలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను జెఎసీ బృందం కల్వనుందని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. ఇందుకోసం అపాయింట్‌మెంట్ కోరనున్నట్లు ఆయన తెలుపగా.. అపాయింట్‌మెంట్ బాధ్యతలను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అప్పగించారని అందుకే జెఎసీ భేటీ కంటే ముందే అశ్వత్థామ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారని సమాచారం. ఈ భేటీకి ప్రొ.కోదండరామ్ కూడా హాజరవడం వెనుక ఆంతర్యం కేంద్రాన్ని ఇన్‌వాల్వ్ చేయాలన్న వ్యూహమేనని తెలుస్తోంది.
ఆ తర్వాత హైదరాబాద్ విద్యానగర్‌లోని ఎంప్లాయిస్ యూనియన్‌ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ, విపక్షనేతల సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో తీసుకున్నపలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఈ నిర్ణయాలను వెల్లడించారు. నవంబర్ 3వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల వద్ద, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాలుగో తేదీన రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర దీక్షలు జరపాలని, 5న సడక్ బంద్‌తో రహదారులను దిగ్బంధించాలని తలపెట్టారు.
నవంబర్ 6న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ముందు నిరసన తెలపాలని, 7న ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు, రాజకీయ పార్టీలతో డిపోల ముందు దీక్షలు చేయాలని నిర్ణయించినట్లు అశ్వత్థామరెడ్డి వివరించారు. నవంబర్ 8న ఛలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు చేపట్టి.. నవంబర్ తొమ్మిదో తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై దీక్ష చేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని, బస్ రూట్లను వేరు చేసే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్వత్థామరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు.
మిలియన్ మార్చ్ ఖాయమా ?
నవంబర్ 9వ తేదీన ట్యాంక్ బండ్‌పై ధర్నా చేస్తామని అశ్వత్థామరెడ్డి చెబుతున్నప్పటికీ.. అది మిలియన్ మార్చ్‌గా నిర్వహించాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో నిర్వహించిన హిస్టారిక్ మిలియన్ మార్చ్ తరహాలోనే రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాల శ్రేణులను పెద్ద ఎత్తున సమీకరించాలని భావిస్తున్నారు. ముందుగానే మిలియన్ మార్చ్ అంటే ప్రభుత్వ నిర్బంధ చర్యలు ప్రారంభమవుతాయన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ట్యాంక్ బండ్‌పై ధర్నా అన్న ప్రకటనలకే జెఎసీ పరిమితమైనట్లు తెలుస్తోంది.