తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చంది. ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులకు పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టానికి సవరణ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చట్టంలో మార్పులు తీసుకొచ్చినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది న్యాయశాఖ.
వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.