‘మూడు పెళ్లిళ్లు చేసుకుని పవన్ మాసికం చేసుకున్నాడు’

|

Sep 29, 2020 | 2:04 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మోదీ కాళ్లే పట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై పవన్ ని తాము నమ్మామని నారాయణ అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందని నారాయణ […]

మూడు పెళ్లిళ్లు చేసుకుని పవన్ మాసికం చేసుకున్నాడు
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మోదీ కాళ్లే పట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై పవన్ ని తాము నమ్మామని నారాయణ అన్నారు. జగన్, చంద్రబాబు, పవన్ వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోతోందని నారాయణ మండిపడ్డారు. వీరివల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తెలిపారు.

రైతులకు ఎంతో నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైసీపీ, టీడీపీలు మద్దతు పలకడం దారుణమన్న ఆయన.. బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాననే భయం జగన్ లో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పుడు.. పుష్కలంగా ఎంపీలున్నా చేతులెత్తేశారని విమర్శించారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు.