పోలీస్‌లపై పంజా విసురుతోన్న కరోనా

|

Sep 29, 2020 | 3:46 PM

మహారాష్ట్రలో కరోనా వైరస్ పోలీస్‌లపై తన ప్రతాపాన్ని చూపుతోంది. నిత్యం వందలాది మంది పోలీసులు కరోనా బారినపడుతున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 215 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ సోకిన పోలీస్‌ల సంఖ్య 23,033కు చేరింది. ఇందులో 19,681 మంది కోలుకోగా, ప్రస్తుతం 3,107 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనాతో ఇప్పటి వరకు 245 మంది పోలీసులు మరణించారు. ఇదిలాఉంటే, […]

పోలీస్‌లపై పంజా విసురుతోన్న కరోనా
Follow us on

మహారాష్ట్రలో కరోనా వైరస్ పోలీస్‌లపై తన ప్రతాపాన్ని చూపుతోంది. నిత్యం వందలాది మంది పోలీసులు కరోనా బారినపడుతున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 215 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ సోకిన పోలీస్‌ల సంఖ్య 23,033కు చేరింది. ఇందులో 19,681 మంది కోలుకోగా, ప్రస్తుతం 3,107 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనాతో ఇప్పటి వరకు 245 మంది పోలీసులు మరణించారు. ఇదిలాఉంటే, కరోనా కేసులు.. మరణాలపరంగా భారతదేశంలోనే మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.35 లక్షలు దాటగా 35 వేల మందికిపైగా మరణించారు.