చంపుతారనుకోలేదు, కడుపుకోత మిగిల్చారు : హేమంత్‌ తల్లి రాణి

|

Sep 25, 2020 | 12:18 PM

తన బిడ్డను చంపుతారని అస్సలు అనుకోలేదని భోరున విలపిస్తూ టీవీ9కు చెప్పింది పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన హేమంత్‌ తల్లి రాణి. ‘అల్లారుముద్దుగా నా కొడుకును పెంచుకున్నాను.. నాకు కడుపు కోత మిగిల్చారు’ అంటూ వాపోయింది. ‘నేనంటే నా కొడుకుకు ప్రాణం.. ఉదయం లేచినప్పటి నుండి నాతో మాట్లాడకుండా ఉండలేడు.. నిన్న కూడా నాతో మాట్లాడాడు’ అని రాణి అన్నారు. మారుతీరావు లాంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా సమాజంలో మార్పు రాలేదన్న ఆమె.. కన్న […]

చంపుతారనుకోలేదు, కడుపుకోత మిగిల్చారు : హేమంత్‌ తల్లి రాణి
Follow us on

తన బిడ్డను చంపుతారని అస్సలు అనుకోలేదని భోరున విలపిస్తూ టీవీ9కు చెప్పింది పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన హేమంత్‌ తల్లి రాణి. ‘అల్లారుముద్దుగా నా కొడుకును పెంచుకున్నాను.. నాకు కడుపు కోత మిగిల్చారు’ అంటూ వాపోయింది. ‘నేనంటే నా కొడుకుకు ప్రాణం.. ఉదయం లేచినప్పటి నుండి నాతో మాట్లాడకుండా ఉండలేడు.. నిన్న కూడా నాతో మాట్లాడాడు’ అని రాణి అన్నారు. మారుతీరావు లాంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా సమాజంలో మార్పు రాలేదన్న ఆమె.. కన్న కూతుర్ని విధవను చేసిన తండ్రీ ఒక తండ్రేనా అని ప్రశ్నించింది. వాళ్లు డబ్బున్న దరిద్రులని ఆమె పేర్కొంది. అవంతిక తండ్రి ఎంత కఠినాత్ముడైనా.. ఆమె తల్లికి విషయం తెలియదా అని రాణి ప్రశ్నించారు.

ధన అహంకారము, కులం పిచ్చి తోటే తన కొడుకును హత్య చేశారని.. వాళ్లు రెడ్డిలు తాము వైశ్యులమని చెప్పి నా కొడుకుని పొట్టనపెట్టుకున్నారని కన్నీటిపర్యంతమైంది. అవంతికను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్లకు ఇచ్చేశామని, అవంతిక కేవలం నైటీతో మాత్రమే తమ ఇంటికి వచ్చిందని ఆమె చెప్పింది. కన్న కూతురిలా కోడలు అవంతికను ప్రేమతో చూసుకుంటున్నానని తెలిపింది. హేమంత్ ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని.. మరో కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్ష పడాలని తల్లి డిమాండ్ చేసింది.