వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లను కేటాయిస్తున్న ప్రకటించిన సీతారామన్.. అదే సమయంలో 6.11 కోట్లమంది రైతులకు వ్యవసాయ బీమా సౌకర్యం (ఫసల్ బీమా) కల్పిస్తున్న తెలిపారు. వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రల పథకంతో ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. 2022 నాటికి రైతుల తలసరి ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధికి రూ.15లక్షల కోట్లతో పాటు.. కౌలు భూములకు కొత్తచట్టం వర్తింపచేస్తామని తెలిపారు. మత్సకారులకు సాగర్ మిత్ర పథకాన్ని అమలు చేస్తామని… వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం ప్రత్యేక విమానయాన సంస్థను కృషి ఉడాన్ పేరిట ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.