భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. మహిళతో అతను సాన్నిహత్యంగా ఉన్న సమయంలో వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రాజానంద్ కు కొన్నేళ్ల క్రితం మేరీ అనే మహిళతో వివాహమైంది. రాజానంద్ మున్సిపాలిటీ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి అక్కడే పని చేస్తున్న ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. మేరీకి ఈ విషయం తెలిసింది. భర్తను నిలదీసింది. ఈ అంశంపై ఇరువురి మధ్య గొడవలు తలెత్తాయి.
భర్త ఇంటికి సరిగ్గా రాకపోయేసరికి మేరీ తీవ్ర వేదనకు గురైంది. తన భర్త వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళ ఇంటికి వెళ్లింది. అక్కడ వారిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇంటికి తాళం వేసి పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
Also Read
Pushpa 2: సుకుమార్ భారీ ప్లాన్.. పుష్ప సీక్వెల్లో సమంత.. కానీ ఈసారి మాత్రం ఇలా..
Naga Shaurya : కుర్ర హీరో సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. కృష్ణ వ్రిందా విహారి టీజర్ వచ్చేది అప్పుడే..
Viral Video: ఒంటెతో సెల్ఫీ.. ఎంత డేంజరో తెలుసుకున్న యువతి.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!