YS Viveka Murder Case: మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పులివెందులలో మరోసారి సీబీఐ విచారణను ప్రారంభించనుంది. ఈ కేసును దర్యాప్తుకు తీసుకున్న సీబీఐ బృందాలు.. జూలైలో మొదటిసారి విచారణ ప్రారంభించాయి. రెండు వారాల పాటు ముమ్మరంగా దర్యాప్తు చేసి సాక్ష్యులు, అనుమానితులను అధికారులు విచారించారు. ఇక ఇప్పుడు నలభై రోజుల తరువాత మళ్లీ అక్కడ విచారణను ప్రారంభించనున్నారు అధికారులు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల ఆర్&బి గెస్ట్హౌజ్కి చేరుకున్నారు. అయితే గతేడాది మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికలు దగ్గరగా ఉన్న సమయంలో ఆయన హత్యకు గురవ్వగా.. ఈ ఘటన రాజకీయంగానూ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Read more:
తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గుడ్న్యూస్
అన్ని ప్రార్థనా మందిరాల వద్ద కెమెరాలను అమర్చండి: ఏపీ డీజీపీ