నూతన్ నాయుడుకి షాక్‌.. బెయిల్‌ నిరాకరణ

| Edited By:

Sep 16, 2020 | 2:47 PM

శిరోముండనం కేసులో నూతన్ నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది

నూతన్ నాయుడుకి షాక్‌.. బెయిల్‌ నిరాకరణ
Follow us on

Nutan Naidu Bail: శిరోముండనం కేసులో నూతన్ నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో నూతన్ నాయుడు, ఆయన భార్య ప్రియ మాధురి సహా మరో ఆరుగురు ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయన చెప్పగా.. దాంతో ఏకీభవించిన జడ్జీ వెంకట నాగేశ్వరరావు బెయిల్ పిటిషన్‌ని తోసిపుచ్చారు.

ఇదిలా ఉంటే విచారణలో భాగంగా శ్రీకాంత్‌కి శిరోముండనం చేయమని తాను చెప్పలేదని నూతన్‌ నాయుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్‌ పేరును చెప్పలేదని, అలా చెప్పి పనులు చేయించుకునే శక్తి తనకు లేదని పోలీసుల దగ్గర నూతన్ నాయుడు వెల్లడించినట్లు సమాచారం. అయితే సెల్‌ఫోన్ దొంగలించాడన్న నెపంతో తమ దగ్గర పనిచేసి మానేసిన ఓ దళిత యువకుడికి నూతన్ నాయుడు భార్య గుండు చేయించింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Read More:

ట్రాన్స్‌జెండర్ల కోసం జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

చిరంజీవి కోరిక.. మార్పులు చేస్తోన్న కొరటాల..!