పోలీస్నంటూ బెదిరించిన ఓ వ్యక్తి మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయాడు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో జరిగింది. పోలీస్ను అంటూ వచ్చిన ఓ వ్యక్తి మెదక్ జిల్లా రాజపేటకు చెందిన కుమ్మరి సాయిలు అనే వ్యక్తి జేబులోనుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు. దేవులపల్లిలో ఉంటున్న కుమార్తె స్వప్న ఇంటికి సాయిలు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గత నెల 24న ఈ సంఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు సాయిలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.
Read This Story Also: ఓ వైపు బాధ.. మరోవైపు గర్వంగా ఉంది: కల్నల్ సంతోష్ తల్లి