ఈ నెల 21న కాణిపాకం ఆలయం మూసివేత

| Edited By:

Jun 14, 2020 | 7:34 AM

ఈ నెల 21న ప్రముఖ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. సూర్య గ్రహణం కారణంగా ఆ రోజున కాణిపాకం ఆలయాన్ని మూసివేయనున్నట్లు

ఈ నెల 21న కాణిపాకం ఆలయం మూసివేత
Follow us on

ఈ నెల 21న ప్రముఖ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. సూర్య గ్రహణం కారణంగా ఆ రోజున కాణిపాకం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్ ప్రకటించారు. 20వ తేదీ రాత్రి 9:30 గంటలకు మూసివేసి తిరిగి 21వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు ఆలయాన్ని తెరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 3:30 గంటల నుంచి 6 గంటల వరకు దర్శనానికి భక్తులకు అనుమతిని ఇస్తామని వెంకటేష్ అన్నారు. కాగా సూర్య గ్రహణం కారణంగా ఇప్పటికే 21న శ్రీవారి దర్శన టికెట్ల జారీని రద్దు చేశారు. మరోవైపు గ్రహణం కారణంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా ఈ నెల 21న ఆన్‌లైన్ టికెట్లను జారీ చేయకుండా టీడీపీ నిలిపివేసింది.

Read This Story Also: కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి