Governor Tamilisai At Tirmuala: ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్. ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్కు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ బయట మీడియాతో మాట్లాడారు తమిళసై.
శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం గురించి మాకంటే మీకే బాగా తెలిసని ఫ్రంట్ లైన్ వారియర్స్ను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం ఇస్తున్నది టెస్టింగ్ వ్యాక్సిన్ కాదనీ, కృతజ్ఞతలతో ఇస్తున్న వ్యాక్సిన్ అని చెప్పారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవ్వరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి సంకోచించనవసరంలేదని చెప్పారు. పక్క దేశాలపై ఆధారపడకుండా మన దేశ సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ తయారు చేసేలా దీవించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read:
Malladi Krishna Rao: యానాంలో మతమార్పిళ్లు.. మంత్రి మల్లాడి కృష్ణారావు సమాధానం ఏంటంటే..?