Malladi Krishna Rao: యానాంలో మతమార్పిళ్లు.. మంత్రి మల్లాడి కృష్ణారావు సమాధానం ఏంటంటే..?
యానాంలో ప్రజలు ఏ మతంలో ఉండాలనేది వాళ్లే నిర్ణయించుకుంటారని అన్నారు పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
Malladi Krishna Rao: యానాంలో ప్రజలు ఏ మతంలో ఉండాలనేది వాళ్లే నిర్ణయించుకుంటారని అన్నారు పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు. ఆదివారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. యానంలో మతమార్పిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయన్న విలేకర్ల ప్రశ్నకు స్పందిస్తూ బయట వాళ్ల ప్రలోభాలతో యానంలో మత మార్పిడి జరగవన్నారు. తాను అన్ని మతాల వారిని సమభావంతో చూస్తున్నాను కాబట్టే 31 సంవత్సరాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నానని తెలిపారు. యానాంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తున్నామని, ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఆటకం లేకుండా అందరూ సహకరించాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఏకంగా మూడు సార్లు అవార్డు అందుకున్నారు మల్లాడి కృష్ణారావు. పుదుచ్చేరి శాసనసభ చరిత్రలో మూడోసారి ఉత్తమ శాసనసభ్యుడిగా ఎంపికైన తెలుగువాడిగా ఆయన రికార్డు నెలకొలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి అభిప్రాయపడ్డారు.
Also Read:
అరగంట వ్యవధిలో ఆ దంపతులు అనంతలోకాలకు.. ఇద్దరూ గుండెపోటుతోనే.. అసలు ఏం జరిగిందంటే..?