TDP Leader Murder Case: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ హాజరుకానున్నారు. కాగా, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి తన భర్తను హత్య చేయించారని మృతుడు సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించింది. ఈ ఆరోరపణలపై స్పందించిన శివప్రసాద రెడ్డి.. తనకూ, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కుండ రవి అనే వ్యక్తి సుబ్బయ్యను హత్య చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా, సుబ్బయ్య హత్య కేసులో కుండా రవితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉంటే, మృతుడు సుబయ్యపై 14 కేసులు ఉన్నాయని, వాటి వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. అతని మీద ఉనన కేసుల కారణంగా ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉండొచ్చని డీఎస్పీ పేర్కొన్నారు.
Also read:
అందుకే నేను రజినీకాంత్తో విభేదించాను.. తలైవా నిర్ణయంపై స్పందించిన దర్శకుడు భారతీరాజా..