Tirumala Temple: తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. సూర్యుడు అస్తమించనే లేదు.. అంతలోనే తిరుమల కొండలను మంచు దుప్పటి కప్పేసింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం సహా తిరుమలగిరులను పొగమంచు కమ్మేయడంతో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం సాక్షాత్కరించింది. సాయంత్రం 4 గంటల నుండి శ్రీవారి ఆలయం ముందు మంచు సోయగాలు భక్తులను ఉల్లాసభరితం చేశాయి. ఒక్కసారిగా మారిన వాతావరణాన్ని భక్తులు ఆస్వాధిస్తున్నారు. వైకుంఠ ద్వారా దర్శనం అనంతరం శ్రీవారి ఆలయం ముందు మంచు సోయగాలను తిలకించిన భక్తులు.. పొగమంచు సోయగాలు అద్భుతంగా ఉన్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచు అందాల్లో శ్రీవారం ఆలయం మరింత రమణీయంగా ఉందంటున్నారు.
Also read: