Andhra Pradesh: భర్తతో గొడవ.. కట్‌చేస్తే, మహేష్‌తో సహజీవనం.. ఆ తర్వాత ఫ్లాట్‌లో ఏం జరిగిందంటే..

విజయవాడ నున్న పీఎస్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మహేశ్వరి టవర్స్ ఐదో అంతస్తు నుంచి దూకి స్పాట్‌లోనే చనిపోయింది. మృతురాలు కండ్రికకు చెందిన హైమావతి (20)గా గుర్తించారు పోలీసులు. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది హైమావతి. మహేశ్వరి టవర్స్‌లో మహేష్‌ అనే యువకుడితో కలిసి సహజీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: భర్తతో గొడవ.. కట్‌చేస్తే, మహేష్‌తో సహజీవనం.. ఆ తర్వాత ఫ్లాట్‌లో ఏం జరిగిందంటే..
Crime News
Follow us

|

Updated on: Aug 12, 2024 | 1:55 PM

విజయవాడ నున్న పీఎస్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మహేశ్వరి టవర్స్ ఐదో అంతస్తు నుంచి దూకి స్పాట్‌లోనే చనిపోయింది. మృతురాలు కండ్రికకు చెందిన హైమావతి (20)గా గుర్తించారు పోలీసులు. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది హైమావతి. మహేశ్వరి టవర్స్‌లో మహేష్‌ అనే యువకుడితో కలిసి సహజీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. మహేష్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం శ్రీనగర్ కాలనీకి చెందిన భవాని అనే స్నేహితురాలికి చెప్పుకుని బాధపడింది హైమావతి. భవానితో కలిసి.. మహేష్‌ను అడిగేందుకు వచ్చిన మహేశ్వరి టవర్స్‌కు వెళ్లింది. కాసేపటికి తాము చూస్తుండగానే కిందకు దూకిందని హైమావతి కిందకు దూకిందని స్నేహితురాలు భవాని చెబుతోంది.. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

అసలేం జరిగిందంటే..

ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూర్తితో హైమావతికి వివాహం జరిగింది.. కొన్నాళ్లు గన్నవరంలోనూ, ఆ తర్వాత రామవరప్పాడు ప్రాంతంలో మూర్తి , హైమావతి దంపతులు నివాసమున్నారు.. ఈ క్రమంలో భర్తతో విభేదాల కారణంగా హైమావతి గత కొన్ని ఏళ్లుగా దూరంగా ఉంటోంది.. ప్రస్తుతం వివిధ రకాల వేడుకలకు ఈవెంట్స్ చేస్తూ జీవనం సాగిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మహేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని.. నున్న మహేష్ టవర్స్ లోఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఇటీవల మహేష్ వేరొక మహిళతో మాట్లాడుతుండడంతో హైమావతి మహేష్ ల మధ్య మనస్పర్ధలు వచ్చాయి.. మహేష్ తీరుపై శ్రీనగర్ కాలనీకి చెందిన భవాని అనే స్నేహితురాలి వద్ద వాపోయింది.. భవాని ఇంటి వద్దకు నిన్న సాయంత్రం మహేష్, హైమావతి చేరుకుని మాట్లాడారు.. ఈ క్రమంలో మహేష్, హైమావతి ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం ఏర్పడింది.. అనంతరం అక్కడి నుంచి మహేష్ నున్న వెళ్లిపోయాడు.. నున్న మహేశ్వరి టవర్స్ వద్దకు హైమావతి, భవాని మరో ఇద్దరు చేరుకున్నారు.. ఈ క్రమంలో మహేష్ తో మాట్లాడుతానని.. ఒంటరిగా ఐదో అంతస్తుకు వెళ్లిన హైమావతి అక్కడి నుంచి దూకింది.. తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..